News February 27, 2025

అంతర్జాతీయ సదస్సులో సిద్దిపేట ప్రొఫెసర్‌కు ప్రశంసా పత్రం

image

ఈనెల 24, 25న నేపాల్ రాజధాని కాట్మండ్‌లో బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల నుంచి పరిశోధకులు పరిశోధనా పత్రాలను ప్రవేశపెట్టారు. జంపన్న వాగు నీటి నాణ్యత పైన చేసిన పరిశోధన పత్రాన్ని ప్రవేశపెట్టిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్ మోహన్‌కు అంతర్జాతీయ సదస్సులో ప్రశంస పత్రాన్ని అందజేశారు.

Similar News

News February 27, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పట్టభద్రులు 22,397 మంది (5.2 శాతం), ఉపాధ్యాయులు 950 మంది (11.52 )శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News February 27, 2025

స్టూడెంట్స్ బుక్స్‌లో ₹3.5కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!

image

పుణే ఎయిర్‌పోర్టులో భారీ హవాలా రాకెట్ బయటపడింది. ముగ్గురు స్టూడెంట్స్ దుబాయ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ వద్ద టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లయిట్ ఎక్కే 2hrs ముందు వారికామె 2 బ్యాగుల్లో బుక్స్ పెట్టి దుబాయ్‌లోని తమ బ్రాంచ్‌లో ఇవ్వమన్నారు. విషయం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని అక్కడి నుంచి మళ్లీ పుణేకి రప్పించారు. చెక్ చేసి బుక్స్‌లోని $4L (Rs 3.5CR)ను స్వాధీనం చేసుకున్నారు.

News February 27, 2025

ముగిసిన మహాకుంభ్‌.. మోదీ ట్వీట్!

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది. ఈక్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘మహాకుంభ్ ముగిసింది. ఐక్యతతో కూడిన గొప్ప ఆచారం ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ మహాకుంభ్‌లో 1.4 బిలియన్ల మంది విశ్వాసం ఏకమైంది. గత 45 రోజులుగా దేశ నలుమూలల నుంచి కోట్ల మంది తరలిరావడాన్ని నేను చూస్తూనే ఉన్నా’ అని తన మదిలో మెదిలిన కొన్ని <>విషయాలను<<>> పంచుకున్నారు.

error: Content is protected !!