News February 4, 2025
అందోల్: క్యాన్సర్ నియంత్రణపై దృష్టి: మంత్రి

క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి సారించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి, నివారణ, గుర్తింపును ప్రారంభదశలో చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4వ తేదీని పురస్కరించకుని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News March 16, 2026
SRH కెప్టెన్గా అభిషేక్ శర్మ!

IPL: సన్రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో ఓపెనింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు అంచనా వేస్తున్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ T20WCలో సైతం ఆడలేదు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నుంచి 3 వారాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
News March 16, 2026
సిరిసిల్ల ప్రజావాణిలో 142 దరఖాస్తులు

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితుల నుంచి 142 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్వయంగా అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 56, డీఆర్డీవోకు 20, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 14 దరఖాస్తులు అందాయి. గృహ నిర్మాణ శాఖకు 13, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు 7 దరఖాస్తులు రాగా.. నీటి పారుదల, మున్సిపల్, పౌర సరఫరాల శాఖలకు మిగిలినవి అందాయి.
News March 16, 2026
అధికారుల చేతుల్లోకి మున్సిపాలిటీలు.. బుధవారం నుంచి స్పెషల్ ఆఫీసర్ల రాక

జిల్లాలోని పిఠాపురం, తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో బుధవారం నుంచి ఈ స్థానాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు లేదా గరిష్ఠంగా ఆరు నెలల పాటు అధికారుల పాలనలోనే పురపాలన కొనసాగుతుంది. పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులంతా ఇకపై ‘మాజీలు’గా మారనున్నారు.


