News December 15, 2024
అందోల్: ‘విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వం 40% మెస్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లోని మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్లో నూతన డైట్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు.
Similar News
News January 26, 2025
మెదక్: కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరణ
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించగా అంబేడ్కర్ సారధ్యంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
News January 26, 2025
మెదక్: లబ్దిదారుల తుది జాబితా సిద్ధం చేయాలి: సీఎస్
ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సూచించారు. శనివారం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమావేశంలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. నాలుగు సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా మండలం నుంచి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేయాలని సీఎస్ సూచించారు.
News January 26, 2025
మెదక్: జిల్లా వ్యాప్తంగా మొత్తం 544 సభలు: కలెక్టర్
మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 నుంచి 23 వరకు 469 గ్రామ సభలు నిర్వహించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75 వార్డు సభలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు 40,092, ఇందిరమ్మ ఇళ్లకు 23,383, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,501, రైతు భరోసాకు 308 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.