News November 19, 2025
అకౌంట్లలోకి రూ.7వేలు.. వీరికి పడవు

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. అయితే నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
Similar News
News January 17, 2026
చిత్తూరు: వేంకన్నా.. రైతుల కష్టాలు వినవన్నా.!

<<18883864>>బకాయిల<<>> చెల్లింపులో మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. గతేడాది ఉమ్మడి చిత్తూరు(D)లో రైతుల నుంచి దాదాపు 2.33 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరించారు. KGకి ప్రభుత్వం రూ.4, కంపెనీలు రూ.8 చెల్లించేలా GOVT నిర్ణయం తీసుకుంది. చిత్తూరు-30, తిరుపతి జిల్లాలో 8 ఫ్యాక్టరీలు పంటను కొనుగోలు చేసి 8 నెలలు అవుతున్నా ఇంత వరకు బకాయిలు చెల్లించలేదట.
News January 17, 2026
పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.
News January 17, 2026
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈనెల 19న TTD విడుదల చేయనుంది. ఈ-డిప్ కోసం 21వ తేదీ 10AM వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న 12PM లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదల కానున్నాయి.


