News May 1, 2024

అచ్యుతాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో అచ్యుతాపురం చేరుకున్నారు. ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మద్ధతుగా సాయంత్రం 3 గంటలకు అచ్యుతాపురంలో జరిగే సభలో పాల్గొననున్నారు. అక్కడ నుంచి పెందుర్తి జంక్షన్‌లో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Similar News

News December 17, 2025

విశాఖలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ

image

విశాఖ నుంచి విమానయాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడి నుంచి రోజుకు 28 దేశీయ విమాన సర్వీసులు.. వారానికి 2 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 8,500-9,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు కలవు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్‌ కనెక్టిటివీ అవసరం ఎంతైనా ఉంది.

News December 17, 2025

విశాఖలో 102 మంది ఎస్‌ల బదిలీ

image

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్‌కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.

News December 17, 2025

బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

image

ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి. నా తరువాత నా వారసులు ఆ పని కచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అందుకు మీ ఆశీస్సులు ఉండాలంటూ’ ఆయన మాట్లాడారు.