News January 9, 2025
అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులతో కలిసి విద్యాశాఖ, రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి సబ్జెక్టులో అర్థమయ్యే రీతిలో అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు.
Similar News
News January 14, 2025
జనగామ: హత్య కేసులో నిందితుల ARREST
హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ASP చేతన్ నితిన్ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని ధర్మకంచ వాసి సంపత్, హైదర్, లక్ష్మణ్ స్నేహితులు. వీరికి MHBD వాసి వెంకన్న(34)తో ఘర్షణ జరిగింది. ఈ గొడవని మనసులో పెట్టుకుని శనివారం రాత్రి మద్యం తాగించి మత్తులో బండరాయితో మోది, మెడ, తలపై బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు. కాగా, 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ASP తెలిపారు.
News January 14, 2025
వరంగల్: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
భక్తులతో కిక్కిరిసిన కొమురవెల్లి మల్లన్న
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారులు తీరారు. జనవరి 19న పట్నం వారం (మొదటి వారం)తో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ తరుణంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ఆలయ వర్గం వెల్లడించింది. ఈఓ రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున, తదితరులు భక్తులకు సేవలందించారు.