News February 9, 2025
అదుపుతప్పి కారు బోల్తా.. మహిళ మృతి

కర్నూలు(D) వెల్దుర్తిలోని మంగంపల్లి సమీపాన శనివారం కారు బోల్తాపడి మహిళ మృతిచెందింది. సత్యసాయి(D) బత్తలపల్లి(M) గుమ్మలకుంటకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, మహేశ్వరి(32) HYDలో ఉంటున్నారు. తమ్ముడి వివాహానికి ఏడాదిన్నర కుమారుడు వియాన్స్, మరిది అమర్నాథ్తో కలిసి కారులో బయలుదేరారు. మంగంపల్లి వద్ద కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. తన ఒడిలో ఉన్న వియాన్స్ను అదిమి పట్టుకుని ప్రాణాలు కాపాడి, తాను మృతిచెందింది.
Similar News
News February 18, 2026
ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
News February 18, 2026
గన్నవరం ఎయిర్పోర్ట్.. ఒకే రోజు 3,883 మంది ప్రయాణం!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మంగళవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 2,062 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,821 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.
News February 18, 2026
మదనపల్లె ఘటన.. నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం

AP: అన్నమయ్య(D) మదనపల్లెలో <<19164033>>బాలిక హత్య<<>>పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో ఆయనతోపాటు మంత్రులు లోకేశ్, అనిత మాట్లాడారు. నిందితుడిని వదిలిపెట్టబోమని, కఠినశిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు కులవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


