News April 2, 2024

అద్దంకి: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

అద్దంకి మండలం కుంకుపాడుకు చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్ గత నెల 19వ తేదీన బైక్‌పై తాళ్లూరు వైపు వెళుతూ కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు 108లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ యువకుడు సోమవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 16, 2026

ప్రకాశం: నేడే లాస్ట్.. అప్లై చేశారా?

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 16, 2026

మార్కాపురం: 18 ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య.!

image

మార్కాపురం జిల్లా కంభంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల బతుకు మారట్లేదు. సకల జనుల సౌభాగ్యం అని నినాదాలు వినిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 18 ఏళ్ల క్రితం మార్కెట్ యార్డ్ వెనుక వైపు ST/SCలకోసం నిర్మించిన మదర్ థెరిస్సా కాలనీకి ఇప్పటికి కూడా కనీసం నడవడానికి సరైన దారిలేదు. తమ హయాంలో ఎంతో చేశామని చెప్పుకునే పాలకులకు ఇలాంటివి కనపడవా? అనేది ప్రశ్న.

News February 15, 2026

సింగరాయకొండ: డ్రోన్ల నిఘాలో బీచ్ ఫెస్టివల్

image

పాకల బీచ్ ఫెస్టివల్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల నిఘాలో ఉంటుందని ఆయన వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.