News August 6, 2024
అధికారులకు భీమవరం MLA హెచ్చరిక

భీమవరం MLA పులపర్తి రామాంజనేయులు అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల పలువురు వ్యాపారులు MLAను కలిసి వారి ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. కొందరు అధికారులు లంచాలు ఇవ్వాలంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని, లేదంటే వ్యాపారానికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన MLA.. ఎవరైనా అధికారులు ఇకపై వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News December 11, 2025
జిల్లాలో 1315 పోలియో బూత్లు ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో ఈనెల 21న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు కలిగిన 1,87,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉందన్నారు. దీని కోసం 1,315 పోలియో బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు 5,520 మంది ఉద్యోగులు విధులకు హాజరుకావాలని కోరారు.
News December 11, 2025
భీమవరం: ‘జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ’

ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలని కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ అన్నారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ ఇంధన పొదుపు భాగంగా గురువారం వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 14 నుంచి వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో ఇంధన పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.
News December 11, 2025
మొగల్తూరు: వృద్ధురాలిపై అత్యాచారయత్నం

మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో పెద్దిరాజు(30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


