News August 21, 2025
అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

గోదావరి ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో, 2వ ప్రమాద హెచ్చరిక జారీ కానున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేశ్ కుమార్ రంపచోడవరం, చింతూరు, వీఆర్ పురం అధికారులను ఆదేశించారు. బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News January 23, 2026
ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభం కావాలి: కలెక్టర్

పెండింగ్లో ఉన్న పీఎం కుసుమ్ పనులను ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాంట్రాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఏప్రిల్ నాటికి 23,000 సోలార్ ఇన్స్టాలేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.
News January 23, 2026
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో 49 పోస్టులకు నోటిఫికేషన్

అహ్మదాబాద్లోని <
News January 23, 2026
లక్ష్మీదేవి కొలువై ఉండే పదార్థాలు ఇవే..

శాస్త్రాల ప్రకారం పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, వీటిని గౌరవిస్తూ ఇల్లు శుభ్రంగా ఉంచుకునే వారిపై ఆమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఈ వస్తువుల పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సోమరితనం, కలహాలు ఉన్న చోట లక్ష్మి నిలవదని చెబుతున్నారు. వాటి పట్ల గౌరవంగా వ్యవహరిస్తే సంపద, ఐశ్వర్యం నిలకడగా ఉంటాయి.


