News March 2, 2025

అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల మరణాలు: కాటసాని

image

ఆత్మకూరులో అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే తాగునీటి కలుషితమై ముగ్గురు మృతి చెందారని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. 3 నెలలుగా కాలనీలో తాగునీటి కలుషితం జరుగుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలన్నారు.

Similar News

News November 14, 2025

జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఇక్కడే

image

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మన్నెగూడెంలో 10.7℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కథలాపూర్ 11, గొల్లపల్లి 11.2, రాఘవపేట 11.2, ఐలాపూర్ 11.3, మల్లాపూర్ 11.4, మద్దుట్ల 11.4, పెగడపల్లి, రాయికల్ 11.5, మల్యాల 11.7, జగ్గాసాగర్ 11.8, పూడూర్ 11.9, మేడిపల్లి, నేరెల్ల 12, గోదూరు, కోరుట్ల 12.2, అల్లీపూర్, పొలాస 12.3, మెట్‌పల్లె, జగిత్యాల 12.5, సారంగాపూర్లో 12.8℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News November 14, 2025

యూ డైస్, అపార్.. వేగవంతం చేయాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

సిరిసిల్ల జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో యూ డైస్‌ అప్‌డేట్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. యూ డైస్, అపార్, రెసిడెన్షియల్ విద్యాలయాలు, కేజీబీవీలు తదితర అంశాలపై శుక్రవారం కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆమె సమీక్షించారు. జిల్లాలో మొత్తం 628 విద్యాలయాలు ఉన్నాయని, అన్ని స్కూళ్లలో ఈ ప్రక్రియలు 100 శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News November 14, 2025

APPLY NOW: NIPHMలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (<>NIPHM<<>>) 3పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, టెన్త్, ITI/వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://niphm.gov.in/