News December 1, 2025

అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

image

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.

Similar News

News February 13, 2026

ఒంగోలు: రేపటి నుంచే బీచ్ ఫెస్టివల్‌.. టైమింగ్స్ ఇవే!

image

ప్రకాశం జిల్లా పాకలలో బీచ్ ఫెస్టివల్ ఈనెల 14, 15వ తేదీల్లో జరగనుంది. 14వ తేదీ ఉదయం 9గంటల నుంచి రాత్రి 11గంటల వరకు, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజా బాబు చెప్పారు. హెలికాప్టర్ రైడింగ్, ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్లు ఉంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు.

News February 13, 2026

బీచ్ ఫెస్టివల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

సింగరాయకొండ మండలం పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. పనులు జరిగే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని అన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

News February 13, 2026

బీచ్ ఫెస్టివల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

సింగరాయకొండ మండలం పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. పనులు జరిగే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని అన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.