News December 1, 2025

అనంతపురంలో రోడ్డెక్కిన అరటి రైతులు

image

అనంతపురం కలెక్టరేట్ వద్ద అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అరటి రైతులు రోడ్డెక్కి ఆర్తనాదాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అరటి రైతులను ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని శైలజానాథ్ హెచ్చరించారు.

Similar News

News February 17, 2026

రాజమండ్రి: టెన్త్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి- డీఆర్ఓ

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్‌లో పబ్లిక్ పరీక్షలపై సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డీఆర్ఓ టి. సీతారామ మూర్తి దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని డిఆర్ఓ సూచించారు.

News February 17, 2026

NGOS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్

image

నెల్లూరు: ఏపీ NGOS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనను నెల్లూరులోని ఎన్జీవో హోంలో జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వరంలో మంగళవారం సత్కరించారు. ట్రెజరీ అసోసియేషన్ నాయకుడు రమణారెడ్డి, ఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సభ్యులు నంది మండలం ఆంజనేయ వర్మ, లక్కాకుల పెంచలయ్య, గాదిరాజు రామకృష్ణ, రాజేంద్ర సురేష్, డీఈవో రాజేంద్ర, సతీశ్ పాల్గొన్నారు.

News February 17, 2026

NGKL: తాగునీటి కోసం మందస్త చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యుాఎస్ ఇంజీనీర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలిసి తాగునీటి సరఫరా, నిల్వలు, పైప్‌లైన్ వ్యవస్థపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.