News September 11, 2025
అనంతపురం, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు డా.వినోద్ కుమార్, టీఎస్ చేతన్ బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లాకు నూతన కలెక్టర్గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News December 17, 2025
కొండెక్కిన వెండి ధరలు

వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీపై ఏకంగా రూ.11వేలు పెరిగింది. దీంతో ఓవరాల్ రేట్ రూ.2,22,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,34,510గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరిగి రూ.1,23,300కు చేరింది.
News December 17, 2025
పెద్దపల్లి: ఉదయం 9 వరకు పోలింగ్ ఎంతంటే..?

పెద్దపల్లి జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బుధవారం ఉదయం 9 వరకు 22.50 శాతం పోలింగ్ నమోదైంది. ఎలిగేడు మండలంలో 22.56 శాతం, ఓదెల మండలంలో 19.50 శాతం, పెద్దపల్లి మండలంలో 21.80 శాతం, సుల్తానాబాద్ మండలంలో 26.08 శాతం పోలింగ్ రికార్డైంది.
News December 17, 2025
ఇందల్వాయి హత్య.. పోలీసుల అదుపులో అనుమానితులు

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద నిన్న మహ్మద్ సల్మాన్ అనే <<18587725>>లారీ డ్రైవర్ <<>>హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రచారం జరగగా అనుమానితులను ఇందల్వాయి పోలీసులు అదుపులో తీసుకున్నారు. చంద్రయన్ పల్లి వద్ద నిందితులు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.


