News August 13, 2025

అనకాపల్లిలో 126 అడుగుల భారీ గణపయ్య

image

ఈనెల 27వ తేదీ నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో 126 అడుగుల భారీ వినాయకుడి విగ్రహాన్ని చురుగ్గా నిర్మిస్తున్నారు. సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 27న విగ్రహాన్ని ప్రతిష్టించి వచ్చే నెల 22వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు చేస్తారు. అలాగే పలు సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News March 15, 2026

ఏప్రిల్‌లో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన: ఎమ్మెల్యే గంటా

image

ఆనందపురం మండలం తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌కు ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కొమ్మాదిలోని ఒక ప్రైవేట్ కాలేజీ రజతోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ కృషితో విశాఖ ఐటీ హబ్‌గా మారుతోందని, అమెరికా వెలుపల గూగుల్ సంస్థకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంటుందని గంటా పేర్కొన్నారు.

News March 15, 2026

కొత్తగూడెం: ఇది కదా హిందూ-ముస్లిం ఐక్యత అంటే..

image

కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీలో గణేశ్ ఆలయ పూజారి హరగోపాల్ శర్మ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాసాలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా పాటించే ముస్లింలను సాయంత్రం ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక వంటకాలు వడ్డించారు. హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పూజారి శర్మను అభినందించారు. పరస్పర సౌహార్దానికి ఇది మంచి ఉదాహరణగా నిలిచింది.

News March 15, 2026

ఖమ్మంలో సౌర ప్లాంట్లకు 31 వరకు దరఖాస్తులు

image

సాగుకు పనికిరాని, నీటి వనరులు లేని భూముల్లో రైతులు పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రెడ్కో మేనేజర్ పి.అజయ్‌కుమార్ తెలిపారు. రైతులు సమయానికి దరఖాస్తు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం పొందవచ్చని తెలిపారు.