News December 1, 2025
అనకాపల్లి: ఇళ్లు, ఇంటి స్థలం కోసం వేచి చూస్తున్న వారికి గమనిక

PMAY హౌసింగ్(గ్రామీణ) సర్వే గడువును ఈ నెల 14 వరకు పొడిగించారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు సోమవారం వడ్డాదిలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో స్థలం ఉన్నవారికి ఇళ్ల స్కీం, స్థలం లేని వారికి స్థలంతో ఇళ్లు కూడా మంజూరు చేస్తామన్నారు. గత నెల 30తో గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం గడువు పొడిగించిందన్నారు. అర్హులు సచివాలయాలలో దరఖాస్తు సమర్పించాలన్నారు.
Similar News
News February 11, 2026
సంగారెడ్డి: 9 గంటలకు 13.19% పోలింగ్

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలో ఉదయం 9 గంటలకు 13.19 శాతం పోలింగ్ నమోదైంది. ఆందోలు జోగిపేట- 14.13, గడ్డపోతారం-15.47, గుమ్మడిదల- 12.40, ఇంద్రేశం- 13.30, జిన్నారం 12.57,కొహీర్- 16.52, ఇస్నాపూర్- 17.13, నారాయణఖేడ్- 11.10, సదాశివపేట- 15.68, సంగారెడ్డి 6.94, జహీరాబాద్ 16.64% శాతం పోలింగ్ నమోదయింది.
News February 11, 2026
తిరుమల: లీవ్ పెట్టారా.. పెట్టించారా?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ.బాలాజీ ప్రమేయం ఉందని సిట్ తేల్చింది. చర్యలకు సిఫార్సు చేసింది. అయితే ఆయన సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సెలవు పెట్టారని కొందరి వాదన. చర్యలు తీసుకునే ముందు ఆయనను సెలవు పెట్టించారనే ప్రచారం సైతం జరుగుతోంది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి మరి.
News February 11, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.


