News March 15, 2025
అనకాపల్లి: ఈనెల 31తో ముగియనున్న ప్రవేశ గడువు

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గల గురుకుల పాఠశాలలో 5,6,7,8 తరగతులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం, డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఈనెల ఒకటిన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు 31తో ముగుస్తుందని అన్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 10, 2026
NRPT: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియలో మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసినట్లు నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు సెలవును సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News February 10, 2026
గన్నవరం: సచివాలయ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

గన్నవరం మండలం కొండపావులూరులో స్థానిక సచివాలయ మహిళా కానిస్టేబుల్ లలిత ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News February 10, 2026
US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.


