News September 13, 2025
అనకాపల్లి: కుప్పలుగా పడి ఉన్న చనిపోయిన కోళ్లు

అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన బాయిలర్ కోళ్లు దర్శనమిస్తున్నాయి. దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం వద్ద రైవాడ కాలువతోపాటు చెరువుల్లో శనివారం చనిపోయిక కోళ్లు కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్ళను రాత్రి సమయంలో కాలువల్లో వేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.
Similar News
News December 11, 2025
కడప: గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వర్ధంతి

కడప జిల్లా వాసులు గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని మరువలేరు. ఆమె గానం చేసిన వేంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రతి శనివారం ఉదయం కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి ప్రసారమవుతుంది. ఆమె పాటలు గుండెల్లో గుర్తుండిపోయాయని, ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె గానం ఎప్పుడూ గుర్తుంటుందని కడప వాసులు గురువారం ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నారు.
News December 11, 2025
విశాఖలో రూ.307 కోట్లతో రోడ్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

విశాఖలో రూ.306.95 కోట్లతో 88.35 కి.మీ. మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)లో ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జోన్-2లోని కార్ షెడ్ -పీఎం పాలెం రోడ్డును పరిశీలించి కార్యాచరణ ప్రారంభించారు. రోడ్లను ఆధునిక వసతులు, పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
News December 11, 2025
కడప YVUలో ప్రవేశానికి దరఖాస్తులు

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవియూ డైరెక్టర్ డా. టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జి కోర్సుకు అర్హులు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చు.


