News March 15, 2025
అనకాపల్లి: ‘చీరకు దీపం అంటుకుని మృతి’

అనకాపల్లి దాడివారి వీధిలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదానికి గురైన వృద్ధురాలు కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీనికి సంబంధించి పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీశెట్టి జోగరత్నం ఈ నెల 10న పూజ చేస్తున్న సమయంలో చీరకు దీపం అంటుకుని అగ్నిప్రమాదానికి గురైంది. చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించగా మృతి చెందింది. ఈమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News February 16, 2026
మేడ్చల్: నేడే పుర పీఠం పోరు..!

జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు నేడు ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. MCపల్లిలోని 24 వార్డులకు BRS 14 స్థానాలు గెలిచి పురపీఠాన్ని దక్కించుకోనుంది. ఎల్లంపేటలో 24గాను BRS 12 గెలిచింది. MLA మల్లారెడ్డి ఎక్స్అఫిషియో ఓటుతో పురపీఠాన్ని తమ ఖాతాలో వేసుకుందామనుకున్నారు. ఈటల ఎక్స్అఫిషియో ఓటుతో కాంగ్రెస్, BJP కలిసి BRSకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం. అలియాబాద్లో ఏపార్టీకి మెజార్టీ లేకపోవడంతో రసవత్తరంగా మారింది.
News February 16, 2026
గర్భం దాల్చకుండానే చనుబాలు వస్తున్నాయా?

గర్భం దాల్చకపోయినా మహిళల్లో పాలు ఉత్పత్తి కావడాన్ని గెలాక్టోరియా అంటారు. ఈ సమస్య కేవలం మహిళల్లో మాత్రమే కాదు.. పురుషుల్లో కూడా వస్తుంది. ఇది ఎక్కువగా పిట్యూటరీ గ్రంథి, హార్మోన్ల అసమతుల్యత, గర్భనిరోధక మాత్రలు, యాంటీ డిప్రెసెంట్స్, బీపీ, లోదుస్తులు, థైరాయిడ్, అమెనోరియా, హైపోథైరాయిడిజం, కిడ్నీ సమస్యలు, జనన నియంత్రణ మందులు వాడటం, మెంతి, సోంపు వంటి మూలిక మందులు వాడటం వల్ల చనుబాలు ఉత్పత్తి అవుతాయి.
News February 16, 2026
బిల్గేట్స్కు సీఎం చంద్రబాబు గ్రాండ్ వెల్కమ్

AP: అమరావతి పర్యటనకు వచ్చిన బిల్గేట్స్కు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద గేట్స్కు పుష్పగుచ్ఛం అందించి వెల్కమ్ చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్తో బిల్గేట్స్ భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చించనున్నారు.


