News November 19, 2025
అనకాపల్లి జిల్లాలో 2,42,480 రైతులకు లబ్ధి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 19వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,300, చోడవరంలో 51,260, మాడుగులలో 45,340, నర్సీపట్నంలో35,040, పాయకరావుపేటలో 39,300, ఎలమంచిలిలో 33,760 మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
Similar News
News January 24, 2026
పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీజీఐఐసీ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు భూసేకరణ పూర్తయిన భూముల రికార్డు మ్యాపులను సిద్ధం చేయాలని చెప్పారు. రైతులకు చెల్లించిన పరిహారం వివరణపై పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.
News January 24, 2026
కామారెడ్డి: జిల్లాలో ‘బీసీ’లకే అగ్రపీఠం!

పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు ప్రాధాన్యత లభించింది. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు జిల్లాలో బీసీల రాజకీయ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో మూడు స్థానాలను బీసీలకు కేటాయించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో రాజకీయంలో అనుభవం ఉన్న ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
News January 24, 2026
ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

iPhone 18 ప్రో సిరీస్కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్తో కాకుండా అండర్ డిస్ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.


