News March 15, 2025
అనకాపల్లి జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అనకాపల్లి జిల్లాలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటోంది. నిన్నటి వరకు రెండు, మూడు చోట్ల మాత్రమే 40 డిగ్రీలు దాటిన ఎండ గురువారం చాలా మండలాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ఈ నేపథ్యంలోనే నాతవరం మండలంలో 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవి సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Similar News
News April 17, 2026
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం

చట్టసభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2029లో అమలు చేసేందుకు సంబంధించి ఇదే చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫై చేయడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్లే ఇలా చేసినట్లు ఓ అధికారి చెప్పారు. ఇదో విచిత్రమైన చర్య అని కాంగ్రెస్ మండిపడింది.
News April 17, 2026
ఇచ్చేయండి సార్.. షరీఫ్కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్లో తీర్మానం!

‘నోబెల్’ విషయంలో ట్రంప్కు పాక్ పోటీ ఇస్తోంది. తమ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్కు పీస్ ప్రైజ్ ఇవ్వాలన్న మీడియా <<19605334>>ప్రచారానికి<<>> పంజాబ్ అసెంబ్లీ వంతపాడింది. యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలకు వారికి ఇవ్వాల్సిందేనని తీర్మానం చేసింది. పాక్లో జరిగిన చర్చలు ఫలించలేదు. కానీ ట్రంప్ తాను <<19668983>>10వ వార్<<>> ఆపబోతున్నానని మళ్లీ నోబెల్ రేసులోకొచ్చారు. మరి పాక్ కథ ట్రంప్ చెవిన పడిందో లేదో!
News April 17, 2026
3,106 చెరువుల్లో ఉపాధి పనులు: చిత్తూరు కలెక్టర్

‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలు పెంపు, సాగునీటి బలోపేతం, కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.


