News February 27, 2025

అనకాపల్లి జిల్లాలో 96.19% పోలింగ్

image

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 96.19 శాతం పోలింగ్ నమోదయింది. చీడికాడ, మాకవరపాలెం, రోలుగుంట, ఎస్.రాయవరం మండలాల్లో శతశాతం పోలింగ్ నమోదయింది. దేవరాపల్లిలో 98.41%, మాడుగులలో 96.36%, గొలుగొండలో 95.12%, రావికమతం 98.08 శాతం, బుచ్చయ్యపేటలో 97.06 %, చోడవరంలో 96.73%, కే.కోటపాడులో 95.33%, నర్సీపట్నంలో 95.20%, నాతవరంలో 97.18% పోలింగ్ నమోదయింది.

Similar News

News February 28, 2025

హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి?: కనిమొళి

image

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్‌ను నిలిపివేసిందని ఆరోపించారు.

News February 28, 2025

ఎడపల్లి: గేదెలను కడగడానికి వెళ్లి వ్యక్తి మృతి

image

ఎడపల్లి పులి చెరువులో గురువారం సాలూర మండల కేంద్రానికి చెందిన మంగలి రమేశ్(35) గేదెలను కడగడానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

News February 28, 2025

చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు.  పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

error: Content is protected !!