News April 20, 2024
అనకాపల్లి: పార్లమెంటుకు ఒకటి, అసెంబ్లీకి 5 నామినేషన్లు

అనకాపల్లి జిల్లాలో శనివారం పార్లమెంటుకు జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఆడారి శరత్ చంద్ర నామినేషన్ వేశారు. చోడవరం నుంచి సూర్య నాగ సన్యాసి రాజు (టిడిపి), మాడుగుల నవ భారత్ నిర్మాణ సేవ పార్టీ నుంచి తాళ్ల రవి, నామినేషన్లు వేశారు. అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్ గా ఆళ్ల సత్తిరాజు, ఎలమంచిలి నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున బి.అమాజమ్మ, కాంగ్రెస్ నుంచి సుందరపు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు
Similar News
News December 16, 2025
పోర్టు కళావాణి స్టేడియం స్వాధీనం చేసుకున్న యాజమాన్యం

అక్కయ్యపాలెం జాతీయ రహదారి కానుకొని ఉన్న పోర్టు కళా వాణి ఆడిటోరియం లీజు ఒప్పందాలను రద్దు చేసినట్లు విశాఖ పోర్ట్ అథారిటీ యాజమాన్యం ప్రకటించింది. క్రీడా సముదాయం గతంలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించామని లీజ్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు పాటించకపోవడంతో రద్దుచేసి నోటీసులు జారీ చేశామని పోర్టు యాజమాన్యం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్టేడియం స్వాధీనం చేసుకున్నారు.
News December 16, 2025
స్టీల్ ప్లాంట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు

విశాఖ స్టీల్ ప్లాంటు హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. 3బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా రోజుకు19వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉండగా..24 గంటల్లో 21,012 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరిగింది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బ్లాస్ట్ ఫర్నేస్–1 నుంచి 7,058 టన్నులు, ఫర్నేస్–2 నుంచి 6,558 టన్నులు, ఫర్నేస్–3 నుంచి 7,396 టన్నులు ఉత్పత్తిచేసి గత రికార్డును అధిగమించారు.
News December 15, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.


