News April 2, 2024
అనకాపల్లి: యువకుడి ఆత్మహత్యపై కేసు

ఎస్.రాయవరం మండలం బంగారమ్మ పాలెం గ్రామానికి చెందిన కారే ఇస్సాక్ (25) పురుగుల తాగి సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విభీషణరావు చెప్పారు. ఒక యువతి విషయమై ఇస్సాక్ను ఆ కుటుంబ సభ్యులు తరచూ బెదిరించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆదివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
Similar News
News February 10, 2026
విలీన గ్రామాల ప్రక్రియ ఆలస్యం.. GVMC ఎన్నికలపై అనిశ్చితి

GVMCలో 64 పంచాయతీల విలీన ప్రతిపాదనపై పంచాయతీరాజ్ శాఖ దగ్గర ప్రక్రియ ముందుకు సాగడం లేదు. విలీనానికి ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల పరిశీలన, వార్డుల విభజన, ఓటర్ల జాబితా వంటి దశలు పూర్తికావాలి. మార్చి 17తో పాలక మండలి గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్పై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1 అర్హత ఆధారంగా వార్డుల వారిగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయాలని ఆదేశించింది.
News February 10, 2026
కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఎంపీ శ్రీ భరత్ భేటీ

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను విశాఖ ఎంపీ శ్రీ భరత్ మంగళవారం పార్లమెంట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ రైల్వే జోన్ కోసం చర్చించారు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విజయవాడ వంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో రైళ్ల కొరత ఉందని తెలియజేస్తూ, ఆయా మార్గాల్లో కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని కోరారు. విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లకు అత్యవసర కోటాను పెంచాలన్నారు.
News February 10, 2026
విశాఖ సీపీని కలిసిన సింహాచలం ఈవో

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని, జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ను సింహాచలం ఈవో వెంకటరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రానున్న చందనోత్సవ వేడుకలపై వీరు చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవోకు జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ సూచించారు.


