News December 3, 2025

అనకాపల్లి: రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి

image

రసాయనక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025-26 కు సంబంధించి రబీ,2026-27 కు సంబంధించి ఈనెల 3న ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ప్రతి రైతు సేవా కేంద్రంలో వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. వర్క్ షాప్ కు రైతులు ,స్వయం సహాయక సంఘాలను పిలిచి ఐదు సూత్రాలను వివరించాలన్నారు.

Similar News

News February 17, 2026

‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

image

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.

News February 17, 2026

అనంత: ఫోన్ రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డి.హిరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2 రోజుల క్రితం నవీన్ తన మొబైల్ రీఛార్జ్ కోసం తండ్రిని డబ్బులు అడగగా ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 17, 2026

మిర్యాలగూడ: GOVT జాబ్ వదిలినా దక్కని ఛైర్‌పర్సన్ పదవి..!

image

కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి కవిత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో 17వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గర అనుచరులుగా పేరు ఉంది. కాగా ఉద్యోగం వదిలేయడంతో ఛైర్‌పర్సన్ పదవి తనకే అనుకున్నారు. కానీ తనకు రాకపోవడంతో బాధతో వెనుదిరిగారు.