News October 8, 2025

అనకాపల్లి: వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు

image

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతన దారులకు ముఖ ఆధారిత హజరు అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ పూర్ణిమా దేవి తెలిపారు. వేతనదారుని ముఖమును ఆధార్ కార్డులో ఉన్న ముఖముతో పోల్చి నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరికి బదులుగా మరొకరు పనిలోకి రాకుండా నియంత్రించినందుకు ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ E-KYC జరుగుతున్నట్లు తెలిపారు.

Similar News

News January 21, 2026

కిషన్ రెడ్డి గారూ ఇది మీ అజ్ఞానమా… లేక: KTR

image

TG: సింగరేణి స్కామ్‌లో ప్రధాన దోషే CBI <<18916865>>విచారణ<<>> కోరాలని ఆశించడం మూర్ఖత్వం కాదా అని కిషన్ రెడ్డిపై KTR మండిపడ్డారు. ‘సీఎం అక్రమ పద్ధతితో తన బావమరిదికి టెండర్‌ను కట్టబెట్టారు. దొంగే PSకు వచ్చి తనపై విచారణ జరపాలని కోరతాడా? BRS బయటపెట్టిన సింగరేణి స్కామ్‌పై కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి తీరు అలాగే ఉంది. ఇది మీ అజ్ఞానమా లేక రేవంత్‌తో బీజేపీకున్న చీకటి ఒప్పందమా’ అని ప్రశ్నించారు.

News January 21, 2026

జగన్ పాదయాత్ర కామెంట్లపై పార్థసారథి కౌంటర్

image

AP: పాదయాత్ర చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ ఒకసారి పాదయాత్ర చేస్తే ఏపీ ఎంతో నష్టపోయింది. మరోసారి చేయడం వలన రాష్ట్రం ఏమైపోతుందో. ప్రజలను ఒకసారి మోసం చేయొచ్చు.. మళ్లీ మళ్లీ మోసం చేయడం అసాధ్యం’ అని ఆయన విమర్శించారు. కాగా ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని <<18916311>>జగన్<<>> ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే.

News January 21, 2026

గ‌ణ‌తంత్ర స్ఫూర్తితో వేడుక‌ల‌కు సిద్ధంకండి: కలెక్టర్

image

ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వ‌హించేందుకు అన్ని శాఖ‌ల అధికారుల స‌మన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఎటువంటి లోడు పాట్లు లేకుండా ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అన్ని శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా నిర్వ‌హించారు. సంక్షేమ పథకాల‌కు సంబంధించి శకటాల ప్రదర్శన నిర్వ‌హ‌ణ‌కు ప్రక్రియ మొదలపెట్టాలన్నారు.