News September 12, 2025
అనకాపల్లి: 16,000 దోమతెరల పంపిణీకి ఏర్పాట్లు

ఓ ప్రైవేట్ పరిశ్రమ సహకారంతో అనకాపల్లి జిల్లాలో 111 గ్రామాలకు 16,000 దోమతెరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ వంటి సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు కూడా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Similar News
News December 16, 2025
MBNR: ఓటు హక్కును వినియోగించుకోండి- ఎస్పీ

ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామన్నారు.
News December 16, 2025
ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)
News December 16, 2025
42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.


