News November 19, 2025

అన్నదాత సుఖీభవ, ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

image

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నగదు జమ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి సూచనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కలిపి రూ.7 వేలు జమ అవుతాయని తెలిపారు.

Similar News

News January 20, 2026

ప.గో: ఇంటర్ పరీక్షలపై డీఆర్వో సూచనలు

image

ఈ నెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News January 20, 2026

ఉండిలో జంట మృతదేహాల కలకలం

image

ఉండిలో జంట మృతదేహాల లభ్యం కావడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సుబ్బారావు అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం నిమ్మలపేటలో విజయ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసగా రెండు మృతదేహాలు బయటపడటంతో ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

News January 20, 2026

కూల్ డ్రింక్ తాగిన బాలుడి మృతి.. UPDATE

image

<<18903335>>ఎలుకల మందు కలిపిన కూల్ డ్రింక్<<>> తాగిన భీమవరం బలుసుమూడి ఉండే మాన్యం మహారుద్ర కాంత్ అనే బాలుడు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భీమవరం వన్ టౌన్ SI రామారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి నుంచి వలస వచ్చిన సుబ్బారావు కుటుంబం భీమవరంలో అద్దెకు ఉంటోంది.