News November 19, 2025

అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

Similar News

News January 22, 2026

దేవాలయాల భద్రతపై ఎస్పీ సమీక్ష

image

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దేవాలయాల భద్రతపై దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, పోలీస్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విలువైన ఆభరణాలు, వస్తువులను కార్యక్రమాల అనంతరం సురక్షిత లాకర్లలో భద్రపరచాలని ఆదేశించారు.

News January 22, 2026

తొలిసారిగా స్వయం జనగణనకు అవకాశం

image

TG: జనగణనలో తొలిసారిగా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇంటింటి సర్వే ఆరంభానికి 15 రోజుల ముందు వరకు ఇందుకు అవకాశమిచ్చింది. ఈమేరకు గెజిట్ జారీచేసింది. కాగా రాష్ట్రంలో 2026 APR1 నుంచి జన గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జనగణన SEP 30 వరకు జరుగుతుందని పేర్కొంది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ గణన చేపట్టనున్నారు.

News January 22, 2026

ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

image

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.