News September 10, 2025

అన్నమయ్య: ఒక్కకాల్.. దళారుల పని ఫట్

image

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్‌లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు 9573990331, 9030315951. ఈ నంబర్లకు కాల్ చేస్తే దళారుల పనిపడతామని కలెక్టర్ అన్నారు.

Similar News

News December 17, 2025

నంద్యాల జిల్లాలో 11 మంది ఎస్ఐల బదిలీ

image

నంద్యాల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్స్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పీఎస్ఐలతో పాటు ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 11 మందిలో ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నవారికి పోస్టులను కేటాయిస్తూ, మరికొందరిని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు. బదిలీలు చేస్తూ పోస్టులు కేటాయించిన వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News December 17, 2025

MBNR: నేడు 122 సర్పంచ్‌లు, 914 వార్డులకు ఎన్నికలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల నేపథ్యంలో మొత్తం 133 జీపీలు,1152 వార్డ్ సభ్యులకు గాను 10 సర్పంచ్ లు,231 వార్డ్‌లు ఏకగ్రీవం. జడ్చర్ల(M)లో ఒక జీరో నామినేషన్, 7 వార్డ్ సభ్యులకు జీరో నామినేషన్ పోను 122 సర్పంచ్‌లు, 914 వార్డ్ సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు ఏకగ్రీవంతో కలిపి 440 మంది అభ్యర్థులు, వార్డ్ సభ్యులు 2,584 మంది పోటీలో ఉన్నారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.

News December 17, 2025

రూ.లక్షకు రూ.73లక్షల వడ్డీ.. కిడ్నీ అమ్ముకున్న రైతు

image

వ్యవసాయంలో నష్టాలతో పాల వ్యాపారం చేద్దామనుకున్న రైతు కిడ్నీ అమ్ముకున్న విషాద ఘటన MHలో జరిగింది. చందాపూర్(D)కు చెందిన కుడే అనే రైతు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. లాభాలు రాకముందే ఆవులు చనిపోయాయి. రోజుకు రూ.10వేల వడ్డీ వేయడంతో అప్పు రూ.74లక్షలకు చేరింది. పొలం, ట్రాక్టర్ అమ్మినా అప్పు తీరలేదు. దీంతో వ్యాపారుల సలహాతో కుడే కంబోడియా వెళ్లి రూ.8లక్షలకు కిడ్నీ అమ్మి వారికి చెల్లించాడు.