News April 2, 2024
అన్నమయ్య: చిన్నారిని చితకబాదిన టీచర్

యూకేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసింది. విద్యార్థి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని కురవంకలో ఉంటున్న మస్తాన్ కొడుకు మహమ్మద్ ఆలీ వారీస్ (6) సొసైటీ కాలనీలోని స్కూలులో చదువుతున్నాడు. సక్రమంగా చదవడం లేదని టీచర్ చితకబాదింది. తల్లిదండ్రులు బిడ్డ వంటిపై వాతలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,400
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,168
* 10 గ్రాముల వెండి ధర రూ.2,438.
News February 17, 2026
నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
News February 17, 2026
నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.


