News February 8, 2025
అన్నమయ్య జిల్లా కంది రైతులకు అలర్ట్

ఈనెల 10 నుంచి జిల్లాలో కందులు అమ్మే రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ శుక్రవారం తెలిపారు. కందులు సాగు చేసే రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి క్వింటాకు మద్దతు ధర రూ.7550 ప్రకటించడమైనదన్నారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ కమిటీ అధికారి త్యాగరాజు, వ్యవసాయ అధికారి చంద్రలతో తీసుకోవాల్సిన చర్యలపై జేసీ సమీక్షించారు.
Similar News
News February 7, 2026
సాగు భూములకే రైతు భరోసా!

TG: రైతు భరోసా(₹6,000) కేవలం సాగులో ఉన్న భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సీజన్లో సాగు వివరాల ఆధారంగా అర్హులైన రైతులకే నగదు జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ మ్యాపింగ్ సర్వే పూర్తి చేయగా 1.53 కోట్ల ఎకరాల సాగుభూమిలో 20 లక్షల ఎకరాలు పంట వేయకుండా ఉన్నట్లు తేలింది. కాగా మున్సిపోల్ తర్వాత రైతు భరోసా ఇస్తామని CM ప్రకటించారు.
News February 7, 2026
MBNR: నేడు పరీక్ష.. 4,592 మంది పోటీ

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతిలో మిగులలు సీట్ల భర్తీకి నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. 11వ తరగతికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతికి ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో 4,592 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు వట్టెం ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
News February 7, 2026
రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.


