News November 19, 2025
అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్గా నియమించారు.
Similar News
News January 24, 2026
వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు!

AP: వేసవి సెలవుల్లో(ఏప్రిల్-మే) టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైస్కూల్ ప్లస్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వేసవి సెలవుల్లో పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. రెగ్యులర్ పోస్టుల ఖాళీలు ఏర్పడే వరకు క్లస్టర్ టీచర్లు అక్కడే కొనసాగుతారని అన్నారు.
News January 24, 2026
Grok సేవలకు అంతరాయం

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.
News January 24, 2026
అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే..

“యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.


