News September 13, 2025

అభివృద్ధి ఓ వైపు.. ఉద్యమం మరో వైపు..!

image

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.150 కోట్లను కేటాయించగా వందరోజుల యాక్షన్ ప్లాన్‌తో పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పంటనష్ట పరిహారం వివాదం తెరపైకి వచ్చింది. జాతర సమయంలో పంట నష్ట పోతున్న రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైతాంగ పోరాటాన్ని BRS వెనకుండి నడిపిస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 13, 2025

పోచారంలో పదవుల పరేషానీ.!

image

GHMC పునర్విభజనలో భాగంగా పోచారం మున్సిపాలిటీని కేవలం ఒకే డివిజన్‌గా కుదించడంపై నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుమారు 90 పదవులు కనుమరుగు కానుండడంతో, స్థానిక రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తోంది. రాజకీయంగా ఎదగాలనుకున్న ఆశావహుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. దాదాపు లక్షకు పైగా ఓట్లున్న ఈ ప్రాంతాన్ని 2-3 డివిజన్‌లుగా చేయాలని, ఇప్పటి వరకు 65 అభ్యంతరాలు వచ్చాయని Way2Newsకు DC నిత్యానంద్ తెలిపారు.

News December 13, 2025

NGKL: పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి: కలెక్టర్

image

జిల్లాలో రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు నిలిపివేయాలని, భోజన విరామం అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 151 గ్రామపంచాయతీలకు గాను 147 గ్రామాలలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

News December 13, 2025

NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

image

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.