News March 15, 2025
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు: మంత్రి సవిత

ఏపీలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం ఆమె మండలంలోని పెద్దగువ్వల పల్లి నుంచి కల్లుకుంట వరకు రూ.75 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఇప్పటికే 73 పనులకు రూ.5.75 కోట్లు ఖర్చుచేసి పూర్తి చేశామన్నారు. నల్లూరు-దండేపల్లి, DR కొట్టాల-దొడగట్ట వరకు బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 13, 2026
కర్నూలు విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన కర్నూలు విద్యార్థిని జాహ్నవి(23) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి 2023 జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.
News February 13, 2026
కౌంటింగ్ కేంద్రాల్లోకి ఈ వస్తువులు నిషేధం: కామారెడ్డి SP

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలని కామారెడ్డి SP రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే వారు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు కారణమయ్యే వస్తువులు తీసుకురాకూడదని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ సిబ్బందికి అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.
News February 13, 2026
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న కౌంటింగ్.. లీడ్లో BNP!

బంగ్లాదేశ్లో 299 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 55% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. వెంటనే కౌంటింగ్ షురూ చేయగా ఇంకా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం తారిఖ్ రెహ్మాన్కు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) లీడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పోటీదారు జమాత్ ఇస్లామీ పార్టీకి ఓటర్ల మద్దతు తగ్గినట్లు సమాచారం. మరోవైపు BNP ఛైర్పర్సన్, ప్రధాని అభ్యర్థి రెహ్మాన్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.


