News March 30, 2024

అభ్యర్థిగా ప్రకటించి నెలవుతున్నా.. కనిపించని నామా..?

image

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బీఆర్‌‌ఎస్ అన్ని పార్టీలకంటే ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. నామా పేరును ఖరారు చేసి నెలవుతున్నా ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేదట. కడియం కావ్య ఎఫెక్ట్‌తో కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీనుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారంతో నామా పేరు తెరపైకి వస్తోంది. ఆయన పోటీలోనే ఉంటారా? లేక పోటీ నుంచి డ్రాప్ అవుతారా అనేది ఖమ్మం బీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైనట్లు సమాచారం.

Similar News

News March 13, 2026

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంబూరి నియామకం

image

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంబూరి రామలింగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధికారిక ప్రతినిధులుగా 27 మందిని నియమిస్తూ Ex.Mlc, BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి నెల్లూరు కోటేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జిల్లా నుంచి వీ.పుల్లారావు యాదవ్‌ను సైతం నియమించింది.

News March 13, 2026

ఖమ్మం: ‘గ్రీన్ గోల్డ్’ సాగుతో రైతులకు సుస్థిర ఆర్థికాభివృద్ధి

image

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు నాంది పలుకుతూ సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం విజయవంతమైంది. గురుదక్షిణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NMPBతో పాటు కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దిశానిర్దేశం చేశారు.

News March 12, 2026

ఏదులాపురం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

image

ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలో మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.