News April 27, 2024
‘అభ్యర్థుల నామినేషన్లలో 53 మందికి ఆమోదం’

మెదక్ లోక్ సభ స్థానానికి దాఖలైన 54 మంది అభ్యర్థుల నామినేషన్ల లలో 53 మంది నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థి కళ్ళు నరసింహ గౌడ్ నామినేషన్ తిరస్కరించారు. నామినేషన్ ఆమోదం పొందిన 53 మందిలో 18 మంది ఆయా పార్టీలకు చెందిన వారున్నారు. స్వతంత్ర అభ్యర్థులు 35 మంది ఉన్నారని రాహుల్ రాజ్ తెలిపారు.
Similar News
News April 16, 2026
కొల్చారం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.
News April 16, 2026
కొల్చారం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.
News April 16, 2026
మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


