News October 6, 2025
అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేల భూ కొనుగోళ్లు

అమరావతిపై పూర్తి విశ్వాసంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తాడికొండ, తుళ్లూరు మండలాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నివాస నిర్మాణం పురోగతి సాధించిన నేపథ్యంలో ఈ ఉత్సాహం పెరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రి బంగ్లాలు, అంతర్జాతీయ హోటళ్లు (హాలిడే ఇన్, నోవోటెల్), టెక్ పార్క్ పనులు ఊపందుకున్నాయి. ఈ పెట్టుబడులు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News January 24, 2026
నెల్లూరు: అటవీ శాఖ సగానికి.. సగం ఖాళీ..!

జిల్లాలోని రాపూరు, ఆత్మకూరు, నెల్లూరు, కావలి, ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో 2.29 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగా అటవీశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 167 పోస్టులకు 85 ఖాళీలు ఉండగా.. వాటిల్లో DRO 10 పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయి. FSO 21 పోస్టులకు 7, FBO 75 పోస్టులకు 22, ABO 61 పోస్టులకు 57 ఖాళీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎర్రచందనం పక్కదారి పట్టడానికి ఇదొక కారణమని తెలుస్తోంది.
News January 24, 2026
రంజీ మ్యాచ్: ఆంధ్ర 228 రన్స్కు ఆలౌట్

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర <
News January 24, 2026
KNR: పట్టభద్రులకు శుభవార్త

శాతవాహన విశ్వవిద్యాలయంలో నేడు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య యు.ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో 60కిపైగా కార్పొరేట్ కంపెనీల్లో 5000 వేలకు పైగా ఉద్యోగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. శాతవాహన వర్సిటీ-నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


