News September 12, 2025
అమరావతి ORR అప్డేట్

అమరావతి ORR అప్డేట్ వచ్చింది. 140 మీటర్ల వెడల్పుతో సవరించిన DPR ప్రతిపాదనలను రూ.25 వేల కోట్ల అంచనాతో MoRTH సాంకేతిక కమిటీకి పంపారు. ఐతే ఆమోదం పొందిన తర్వాత ఫైల్ PPP అంచనా కమిటీకి, చివరకు ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్కు తరలించబడింది. అమరావతి ORR పై రావడంతో ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని పెరిగింది.
Similar News
News December 8, 2025
ADB: బాండు పేపర్లు.. విచిత్ర హామీలు

పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా నార్నూర్ మండలంలో బాండు పేపర్ రాసిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఇలాగే పలువురు గ్రామానికి ఫలానా పని చేసి ఇస్తాం.. మీ కులం వారికి భవనం కట్టిస్తాం.. మీ కులం వారికి వంట సామగ్రి పంపిణీ చేస్తాం అంటూ హామీలు ఇస్తున్నారు. ఆలయాభివృద్ధికి తోడ్పాటునందిస్తాం.. వీడీసీలకు నగదు ఇస్తామంటూ ఓట్లు అడుగుతున్నారు.
News December 8, 2025
సూర్యాపేట: ఎన్నికలు కలిపాయి వారిని..!

మొన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటాల తూటాలు పేల్చుకున్న వివిధ పార్టీల నాయకులు నేడు ఒక్కటయ్యారు. వైరం మరిచి తమ పార్టీ బలపరిచిన నాయకుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తుంగతుర్తి, వెలుగుపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కొట్లాడుతున్నాయి. ఆత్మకూరు(S)లో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పొత్తు పెట్టుకోగా.. కందగట్లలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఫైట్ చేస్తున్నాయి.
News December 8, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.2°C

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో నస్రుల్లాబాద్ 8.2°C, బొమ్మన్ దేవిపల్లి 8.3, డోంగ్లి 8.4, బీబీపేట 8.6, బీర్కూర్ 8.7, సర్వాపూర్ 8.8, లచ్చపేట, జుక్కల్ 9, ఎల్పుగొండ, గాంధారి 9.3, పుల్కల్ 9.4, బిచ్కుంద 9.6, మాక్దూంపూర్ 9.9, పిట్లం 10°C అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


