News April 24, 2025
అమీన్పూర్: తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సెలవులలో ఎవరైనా పాఠశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
విజయవాడ: రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మార్పు

విజయవాడలో ఈ నెల 16న ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మారినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా తెలిపారు. గతంలో నిర్ణయించిన ఏ1 కన్వెన్షన్ సెంటర్కు బదులుగా, ఇప్పుడు ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మత పెద్దలు, ప్రజాప్రతినిధుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News March 14, 2026
సిరిసిల్ల: ‘మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలి’

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరంతరం మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో మహిళలందరూ సభ్యులుగా చేరాలన్నారు. దేశంలో గంటకు ఇద్దరు మహిళపై లైంగిక దాడులు జరుగుతుందన్నారు.
News March 14, 2026
నంద్యాల: అప్పటిలా వెంటనే అందడం లేదు!

జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుక్ చేసుకున్న 5-7 రోజులకు డెలివరీ ఇస్తున్నారు. సిలిండర్ ధరతో పాటు డెలివరీ ఛార్జీ పేరుతో రూ.1,040 నుంచి రూ.1,050 వరకు తీసుకుంటున్నట్లు పలు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. గతంలో బుక్ చేసుకున్న వెంటనే సిలిండర్లు వచ్చేవని, ప్రస్తుతం 5 నుంచి వారం రోజులు పడుతోందని వాపోతున్నారు. ఇదే అదనుగా కొందరు బ్లాక్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.


