News August 13, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. సిద్దిపేట యువతి మృతి

image

సిద్దిపేట(R) మండలం రావురూకులకి చెందిన లక్కరసు శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులు కుమార్తె శ్రీజ అమెరికాలో <<17381654>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల నుంచి గండిమైసమ్మలో ఉంటున్నారు. చదువులకు అమెరికా వెళ్లిన శ్రీజ MS పూర్తి చేసింది. సోమవారం రాత్రి రెస్టారెంట్ నుంచి తన రూమ్‌కు వెళ్తుండగా, ఆమె కారును ట్రక్కు ఢీకొట్టడంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 10, 2026

పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

image

గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని నిరూపిస్తూ పాడేరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతమైంది. లింగపుట్టు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతికి పాపిల్లరీ కార్సినోమా థైరాయిడ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు టోటల్ థైరాయిడెక్టమీతో పాటు మోడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

News March 10, 2026

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ఈ ప్రణాళికను రూపొందించామని, దీని విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

News March 10, 2026

ఫైనల్లో గొడవ.. అర్ష్‌దీప్‌‌కు ICC ఫైన్

image

T20 WC ఫైనల్లో కివీస్ బ్యాటర్ మిచెల్‌పైకి బంతి విసిరిన ఘటనలో భారత బౌలర్ అర్ష్‌దీప్‌పై ICC చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అర్ష్‌దీప్ ICC ప్రవర్తనా నియమావళి లెవెల్-1 ఉల్లంఘించారని పేర్కొంది. కాగా ఫైనల్ మ్యాచులో మిచెల్‌ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా అర్ష్‌దీప్ బంతి అందుకొని అతడిపైకి విసిరేయడంతో <<19332640>>గొడవ<<>> జరిగింది. తర్వాత మిచెల్‌కు అర్ష్‌దీప్ క్షమాపణ చెప్పారు.