News October 4, 2025
అమెరికాలో LBనగర్ యువకుడి మృతి.. CM దిగ్భ్రాంతి

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో LBనగర్ వాసి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను కలిగించిందని CM రేవంత్ అన్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని CM ట్వీట్ చేశారు.
Similar News
News January 17, 2026
IIIT హైదరాబాద్ బంపర్ ఆఫర్: ఇంటి నుంచే డేటా సైన్స్లో మాస్టర్స్!

IIIT-H వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం యూజీసీ గుర్తింపు పొందిన ఆన్లైన్ ఎంఎస్సీ డేటా సైన్స్ను లాంచ్ చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండానే అడ్మిషన్ పొందే ఈ రెండేళ్ల కోర్సును, ఉద్యోగం చేస్తూనే నాలుగేళ్లలోపు పూర్తి చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12లోపు dfl.iiit.ac.in లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.4 లక్షల ఫీజు. ఏప్రిల్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.
SHARE IT
News January 17, 2026
IIIT హైదరాబాద్ బంపర్ ఆఫర్: ఇంటి నుంచే డేటా సైన్స్లో మాస్టర్స్!

IIIT-H వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం యూజీసీ గుర్తింపు పొందిన ఆన్లైన్ ఎంఎస్సీ డేటా సైన్స్ను లాంచ్ చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండానే అడ్మిషన్ పొందే ఈ రెండేళ్ల కోర్సును, ఉద్యోగం చేస్తూనే నాలుగేళ్లలోపు పూర్తి చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12లోపు dfl.iiit.ac.in లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.4 లక్షల ఫీజు. ఏప్రిల్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.
SHARE IT
News January 17, 2026
మద్యం అమ్మకాల్లో వృద్ధి

TG: 2025 DEC నాటికి మద్యం అమ్మకాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. ఆస్తి పన్ను వార్షిక లక్ష్యం ₹19,087CR కాగా 59.22% (₹11,304CR) సాధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024లో ఇది కేవలం 41.28% మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం ₹27,263 CR లక్ష్యంలో 63.38% (₹17,507CR) సాధించింది. 2024లో ఇది 54.96%. ఇక అమ్మకపు పన్ను 2024లో DEC నాటికి 71% సాధించగా ఈసారి అది 67.07%కి తగ్గింది.


