News November 19, 2025

అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

image

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.

Similar News

News January 15, 2026

KNR: సంక్రాంతి, మేడారం ఎఫెక్ట్.. మేకలకు భలే గిరాకీ!

image

సంక్రాంతి, మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ పెరిగింది. గురువారం మంథనిలోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వ్యాపారులు మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మరోవైపు, ప్రధాన రహదారిపైనే విక్రయాలు జరగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు.

News January 15, 2026

యాదాద్రి భువనగిరి మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

1.భువనగిరి 35: ST 1,SC 5, BC 11, UR 18.
2.ఆలేరు 12: ST 1,SC 2, BC 3, UR 6.
3.చౌటుప్పల్ 20: ST 1,SC 3, BC 6, UR 10.
మోత్కూర్ 12: ST 1,SC 2, BC 3, UR 6.
పోచంపల్లి 13: ST 1,SC 1, BC 4, UR 7.
యాదగిరిగుట్ట 12: ST 1,SC 1, BC 4, UR 6.

News January 15, 2026

20 నుంచి కేయూ దూరవిద్య ఎమ్మెస్సీ పరీక్షలు

image

కేయూ పరిధిలోని దూరవిద్య కేంద్రం(సీడీఓఈ) ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రీవియస్, ఫైనలియర్ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ప్రీవియస్ పరీక్షలు ఈ నెల 20, 22, 24, 27 తేదీల్లో జరుగుతాయి. ఫైనలియర్ పరీక్షలు 20, 22, 24, 27, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.