News August 12, 2025

అరకు: మహిళ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు ధరఖాస్తులు

image

2025-26 ఏడాదికి అరకు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆఫ్ లైన్లో ధరఖాస్తులు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ చలపతిరావు తెలిపారు. కళాశాలలో బీఏ(హిస్టరీ)-40, బీఏ(పాలటిక్స్)-60, బీకాం(సీఏ)-60, బీకాం(జనరల్)-60, బీయస్సీ(జూవాలజీ)-40, బీయస్సీ(కెమిస్ట్రీ)-40, బీయస్సీ(ఫిజిక్స్)-40, బీయస్సీ(మేథ్స్)-40, బీయస్సీ(బోటనీ)-40 సీట్లు ఉన్నాయి. ఇంటర్ పాసైన బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

Similar News

News March 10, 2026

ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

image

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

News March 10, 2026

పెద్దపల్లి: ఈనెల 13న జాబ్ మేళా

image

పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 13న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో మూడు నెలల శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. డిప్లొమా, బీటెక్ అర్హత కలిగి 18–28 ఏళ్ల మధ్య ఉన్నవారు నూతన కలెక్టరేట్ భవనం, రూమ్ నం.233లో ఉదయం 11 గంటలకు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.

News March 10, 2026

అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు ప.గో కలెక్టర్ నాగరాణి

image

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మార్చి 11, 12న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ అంశాలపై విపులంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ పది సూత్రాల అమలు, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై సీఎం సమీక్షించనున్నారు.