News September 11, 2025

అర్హులకు చేయూత ఫించన్ లబ్ధి చేకూరేలా చర్యలు: సిరిసిల్ల కలెక్టర్

image

చేయూత పింఛన్లపై అవగాహన సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం నిర్వహించారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు తదితరులకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు. పారదర్శకంగా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News December 9, 2025

మంథని: రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా

image

మంథని మండలం పుట్టపాక గ్రామ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి నుండి కాటారం వెళ్తున్న టీఎస్ 25 ఎఫ్ 7767 కారు అదుపు తప్పి ఒక పక్క రోడ్డు దిగి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్నవారికి ప్రాణాపాయం తప్పింది. సంఘటన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 9, 2025

జగిత్యాల: పంచాయతీ పోరు.. గ్రామాల్లో ఘుమఘుమలు

image

జగిత్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల పర్వం దాటడంతో ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్, వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరదీశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఉన్న పలు గ్రామాల్లో ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. గత రెండు, మూడు రోజులుగా పలువురు అభ్యర్థులు ఇంటింటికి మటన్, చికెన్ ప్యాకెట్లను అందజేస్తుండడంతో పల్లెల్లో వాసనలు ఘుమఘుమలాడుతున్నాయి.

News December 9, 2025

TODAY HEADLINES

image

* తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు
* వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం: జిష్ణుదేవ్
* చైనా మోడల్‌లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్
* జనవరిలో దావోస్ పర్యటనకు CM CBN
* 25 ఏళ్ల నాటి పాలసీల వల్లే TGకి ఆదాయం: CBN
* వందేమాతరం ఒక మంత్రం: PM
* ప్లానింగ్ లేకపోవడంతోనే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్
* జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక