News November 17, 2025
అలా చేస్తేనే తిరుపతి యాత్ర పూర్తవుతుందట..!

పరమపావనమైన పురుషోత్తముడి దర్శనానికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. పూర్వం సౌకర్యాలు లేకపోవడంతో తిరుచానూరులోనే వేంకన్న దర్శనం జరిగేది. తిరుమలకు సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తులు అక్కడ స్వామివారిని.. తిరుచానూరులో పట్టపురాణి దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి యాత్ర సంపూర్ణం కావాలంటే ఇద్దరిని దర్శించుకోవాలని పలువురు చెబుతున్నారు. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరుకు వస్తుంటారు.
Similar News
News January 20, 2026
ఒంగోలు SP కీలక ఆదేశాలు

మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్ఠంగా పని చేయాలని ప్రకాశం ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు, ఈవ్ టీజింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఏ సమస్య ఎదురైనా త్వరగా వెళ్లాలని ఆదేశించారు.
News January 20, 2026
నెల్లూరు కలెక్టర్కు అవార్డు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తన ప్రతిభ చూపారు. ఆయన అందించిన సేవలకు ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. అత్యధికంగా ఓటర్ల మ్యాపింగ్ చేయడంతో ఆయనకు ఈ అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈనెల 25వ తేదీ జరిగే కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు అందుకోనున్నారు.
News January 20, 2026
నంద్యాల కలెక్టర్కు అవార్డు

నంద్యాల జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జి.రాజకుమారి ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డుకు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గానూ ఉత్తమ ఎన్నికల పద్ధతులను అమలు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. జనవరి 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.


