News September 12, 2025
అల్లీపూర్ రెసిడెన్షియల్ స్కూల్లో సీఈఓ గౌతమ్ తనిఖీ

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ ఎంజేపీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం మండల స్పెషల్ ఆఫీసర్/సీఈఓ బి.గౌతమ్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంట గది పరిశుభ్రత కాపాడుతూ రిజిస్టర్లను సమయానుసారం అప్డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, పీఆర్ ఏఈ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
AP న్యూస్ అప్డేట్స్

* వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్లో రూ.60కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
* సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సూపర్ సిక్స్, GSDP లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
* ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.
News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
News December 13, 2025
బాపట్ల: ‘గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అనుమతివ్వాలి’

బాపట్ల MP, లోక్సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (RT&H) కార్యదర్శి వి.ఉమాశంకర్ను కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలోని “చెందోలు- నిజాంపట్నం – నారోకోడూరు- గుంటూరు” ఫిషింగ్ హార్బర్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టు DPR అలైన్మెంట్కు త్వరగా ఆమోదం ఇవ్వాలని MP తెన్నేటి విజ్ఞప్తి చేశారు.


