News August 13, 2025

అల్లూరి జిల్లా నుంచి 8 మంది టీచర్ల ఎంపిక: DEO

image

బెస్ట్ టీచర్ అవార్డులకు అల్లూరి జిల్లా నుంచి 8మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని DEO బ్రాహ్మజిరావు బుధవారం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్ నలుగురు, SGTలు ఇద్దరు, HMలు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి రాష్ట్ర విద్యాశాఖకు త్వరలో పంపుతామని తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వరకు అమరావతిలో వీరికి ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని, తుది జాబితా 25న ప్రకటిస్తారన్నారు. గురుపూజోత్సవంలో అవార్డు అందజేస్తారని చెప్పారు.

Similar News

News March 9, 2026

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

image

మంగళగిరి AIIMS వసతిగృహంలో డయేరియా కలకలం రేపింది. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ పరిస్థితికి కారణమని అనుమానిస్తున్న అధికారులు, హాస్టల్ నుంచి 40 నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

News March 9, 2026

ఆ ముగ్గురికీ T20WC ట్రోఫీ అంకితం: గంభీర్

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ T20WC విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్‌, అగార్కర్‌లకు అంకితం ఇచ్చారు. టీమ్ గెలుపు బాటలో నడవడానికి అవసరమైన వ్యవస్థను వారు నిర్మించారని కొనియాడారు. ‘ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు స్థిరత్వాన్ని కాపాడారు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ లక్ష్మణ్ జాతీయ స్థాయిలో ప్రతిభను వెలికితీస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News March 9, 2026

BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.