News August 14, 2025
అల్లూరి: పర్యాటక ప్రాంతాలు మూసివేత

రంపచోడవరం డివిజన్లో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నందున పర్యాటకులు రావద్దని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటవద్దని సూచించారు. ఎటువంటి సహాయానికైనా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నం. 08864243561 సంప్రదించాలన్నారు.
Similar News
News March 6, 2026
గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం!

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నడుమ LPG విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టం చేసింది. IOCL, BPCL, HPCLకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రో కెమికల్ రంగాలకు గ్యాస్ సప్లైపై తాత్కాలిక పరిమితులు విధించింది. సాధారణ ప్రజలకు LPG సరఫరాలో అంతరాయం ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News March 6, 2026
చిత్తూరు SE కీలక ఆదేశాలు

వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని చిత్తూరు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్లో ఈ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు.
News March 6, 2026
బాపట్ల: స్కూల్లో అలజడి.. HMపై కులవివక్ష ఆరోపణలు

కర్లపాలెం మండలంలోని పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ పట్ల కుల వివక్ష చూపుతున్నారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ వివాదం ముదరడంతో విషయం శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


