News October 8, 2025

ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం: కేటీఆర్

image

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి మోసపూరితంగా వ్యవహరిస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన అడవి పదిర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్‌ను కేటీఆర్ పరామర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలతో చనిపోయిన 93 మందికి పైగా ఆటో డ్రైవర్ల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించినా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

Similar News

News January 18, 2026

ఖమ్మం:పురపాలక పీఠాలపై ‘మహారాణుల’ రాజ్యమే..

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 9 స్థానాల్లో (రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు) ఆరింటిని మహిళలకే కేటాయించారు. ఖమ్మం మేయర్, వైరా, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేటలను జనరల్ మహిళకు కేటాయించగా.. ఇల్లెందు బీసీ మహిళకు, ఏదులాపురం ఎస్సీ మహిళకు దక్కాయి. కల్లూరు, కొత్తగూడెంలు ఎస్టీ జనరల్ విభాగంలో ఉన్నాయి. పురపాలక పీఠాలపై మహిళల ఆధిపత్యం ఖాయమైంది.

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News January 18, 2026

నకిలీ మద్యం మరణాలకు CBN బాధ్యత వహిస్తారా: వైసీపీ

image

AP: నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మరణించారంటూ ప్రభుత్వంపై YCP మండిపడింది. వీరి చావులకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుంటారా అని ‘ఎక్స్’లో ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లాలో నిన్న సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని విమర్శించింది. ఎక్స్‌పైర్, నకిలీ మద్యం అమ్ముతూ TDP లిక్కర్ సిండికేట్ సొమ్ము చేసుకుంటోందని వైసీపీ ఆరోపించింది.